chaitu: మొత్తానికి చైతూ, సమంతల జోడీ ఖరారైపోయింది!

  • శివ నిర్వాణతో నాగచైతన్య 
  • కథానాయికగా సమంత 
  • పెళ్లి తరువాత జోడీకడుతోన్న ఫస్టు మూవీ

ఒక వైపున నాగ చైతన్య 'సవ్యసాచి' .. 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలతో బిజీగా వున్నాడు. మరో వైపున 'రంగస్థలం' పూర్తి చేసిన సమంత, 'మహానటి'పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి దర్శకుడు శివ నిర్వాణ గట్టి ప్రయత్నమే చేశాడు. 'నిన్నుకోరి' హిట్ తో యూత్ లో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ .. తాను సిద్ధం చేసిన కొత్త కథతో, చైతూ .. సమంతలను ఒప్పించడం విశేషం.

 ఈ ప్రాజెక్టు ఓకే అయినట్టుగా చైతూ ట్వీట్ చేయడం వలన, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేకుండా పోయింది. గతంలో ఈ జంట 'ఏ మాయ చేశావే' .. 'ఆటో నగర్ సూర్య' .. 'మనం ' చేసినప్పటికీ, వివాహం తరువాత వాళ్లిద్దరూ కలిసి చేస్తోన్న సినిమా ఇదే. చైతూకి ఇది 17వ సినిమా .. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితం కానుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.  

  • Loading...

More Telugu News