vidyullekha: 'రామయ్య వస్తావయ్యా' షూటింగులో ఎన్టీఆర్ ను చూడగానే డైలాగ్ మర్చిపోయాను: హాస్యనటి విద్యుల్లేఖ

  • ఎదురుగా ఎన్టీఆర్
  • భయంతో డైలాగ్ రాలేదు 
  • అంతే అక్కడే ఏడ్చేశాను    

తెలుగు తెరపై శ్రీలక్ష్మి తరువాత అంత అవలీలగా కామెడీని పండించే నటిగా విద్యుల్లేఖకు పేరుంది. తన మార్కు కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ, వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించింది. " తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తరువాత నాకు మొట్టమొదటిగా ఎదురైంది లాంగ్వేజ్ సమస్య" అని అంది.

"'రామయ్య వస్తావయ్యా' సినిమాలో ఎన్టీఆర్ ఎదురుగా నిలబడి నటించాలి .. అంతే నాకు షివరింగ్ మొదలైపోయింది. అంత పెద్ద స్టార్ ముందు నిలబడే సరికి భయంతో నాకు డైలాగ్ రాలేదు .. లాంగ్వేజ్ సమస్య ఉండనే వుంది. ఏం చేయాలో తెలియక అక్కడే ఏడ్చేశాను. ఆ సమయంలో హరీశ్ శంకర్ గారే ధైర్యం చెప్పారు. ఆ సంఘటన తరువాత తెలుగు భాషను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. తెలుగు సినిమాలను ఎక్కువగా చూశాను .. తెలుగులోనే మాట్లాడటం మొదలుపెట్టాను. అలా కొంతవరకూ తెలుగుపై అవగాహన వచ్చింది .. ఇప్పుడు తెలుగులో బాగా చేయగలను .. తెలుగు డైలాగ్స్ బాగా చెప్పగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది" అంటూ చెప్పుకొచ్చింది. 

  • Loading...

More Telugu News