periyar: బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి!

  • తమిళనాడులో పెరియార్ విగ్రహం ధ్వంసం
  • తీవ్ర ఆగ్రహానికి గురైన పెరియార్ మద్దతుదారుల
  • కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై దాడి

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన తర్వాత ఆ పార్టీ వర్గీయులు విధ్వంసానికి పాల్పడ్డారు. లెనిన్ విగ్రహాన్ని కూల్చి వేశారు. అనంతరం తాజాగా తమిళనాడులోని వెల్లూరులో ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. విగ్రహంలోని ముక్కు భాగాన్ని పాడు చేశారు.

 విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న కార్యక్రమం కొనసాగుతుండగానే... స్థానికులు వారిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒకరు బీజేపీ నేతగా గుర్తించారు. దీంతో, బీజేపీపై పెరియార్ మద్దతుదారుటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News