Telugudesam: బీజేపీకి షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న పట్నం సుబ్బయ్య!

  • సుబ్బయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
  • మరింత మంది బీజేపీ నేతలు రెడీగా ఉన్నారంటున్న టీడీపీ
  • రసవత్తరంగా మారుతున్న ఏపీ రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ముందుగా హామీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పిన కొన్ని గంటల్లోనే ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీతో తెగదెంపులకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్తూరుకు చెందిన ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం సుబ్బయ్యను పార్టీలో చేర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో, మంత్రి అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. పట్నం సుబ్బయ్యతోపాటు జెడ్పీ మాజీ చైర్మన్ శ్రీనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు. మరింత మంది బీజేపీ నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో నాలుగేళ్ల స్నేహం తర్వాత బీజేపీ నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News