Mahesh Babu: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'ది విజన్ ఆఫ్ భరత్ ' .. మహేశ్ డైలాగ్స్ అదుర్స్

  • కొరటాల దర్శకత్వంలో 'భరత్ అనే నేను' 
  • మహేశ్ అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి 
  • ఏప్రిల్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా రూపొందుతోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. రెండు రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు వదులుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో మహేశ్ మాట్లాడుతున్నట్టుగా ..  ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అనే ఆలోచన చేస్తున్నట్టుగా .. ప్రజలతో చర్చిస్తున్నట్టుగా వున్న ఈ పోస్టర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ రెండు రోజులుగా కూడా 'ది విజన్ ఆఫ్ భరత్'ను ఆవిష్కరించనున్నట్టు చెబుతూ వస్తున్నారు. అలాగే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'ది విజన్ ఆఫ్ భరత్' అంటూ .. ఒక వీడియోను రిలీజ్ చేశారు. " చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది .. ఒకసారి ప్రామిస్ చేసి మాట తప్పొద్దని .. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది .. చాలా కష్టమైంది. ఎంతకష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్లకి భయం .. బాధ్యత ఉండాలి" అంటూ మహేశ్ చెప్పిన డైలాగ్స్ వన్స్ మోర్ అనిపిస్తున్నాయి.

యాక్షన్.. ఎమోషన్ తో కూడిన ఈ వీడియోలో మహేశ్ గతంలో కన్నా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ వీడియోతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే.

More Telugu News