ram: రామ్ తాజా చిత్రంలో మేఘా ఆకాశ్ ఛాన్స్ కొట్టేసింది!

  • త్రినాథరావు నక్కినతో రామ్ 
  • ఒక కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్  

రామ్ తో కొంతకాలంగా సక్సెస్ దాగుడుమూతలాడుతోంది. దాంతో ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన వున్నాడు. అందువల్లనే చాలా కథలు విన్న ఆయన , దర్శకుడు త్రినాథరావు నక్కినకు పచ్చజెండా ఊపాడు. దాంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది.

 దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నారు. మరో కథానాయికగా మేఘా ఆకాశ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. ఇప్పటికే ఈ అమ్మాయి నితిన్ జోడీగా 'లై' చేసింది .. త్వరలో 'ఛల్ మోహన్ రంగ'తో పలకరించనుంది. ఇంతకుముందే ఈ అమ్మాయి రామ్ తో కలిసి 'ఉన్నది ఒకటే జిందగీ ' చేయవలసింది గానీ కుదరలేదు. ఇప్పుడు డేట్స్ కుదరడంతో ఓకే చెప్పేసిందట. వచ్చేవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది .   

More Telugu News