dhruv: తమిళంలోకి 'అర్జున్ రెడ్డి' రీమేక్ .. హీరోగా విక్రమ్ తనయుడు ధృవ్ లేటెస్ట్ లుక్

  • తమిళంలో 'అర్జున్ రెడ్డి' రీమేక్ 
  • హీరోగా విక్రమ్ తనయుడు 
  • దర్శకుడిగా బాలా

తెలుగులో ఈ మధ్య కాలంలో సంచలన విజయాన్ని సాధించిన చిత్రాల్లో 'అర్జున్ రెడ్డి' ముందు వరుసలో కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా, భారీ వసూళ్లను సాధించింది. ఇతర భాషా చిత్ర పరిశ్రమలను సైతం ఈ సినిమా కంటెంట్ ఆకట్టుకుంది. దాంతో అంతా రీమేక్ రైట్స్ కోసం పోటీపడ్డారు. తమిళంలో రీమేక్ హక్కులను పొందినవారు, ఈ రీమేక్ ను స్టార్ హీరో విక్రమ్ తనయుడితో చేయడానికి సిద్ధమవుతున్నారు.

నిజానికి మరో రెండు సంవత్సరాల తరువాత విక్రమ్ తన తనయుడు 'ధృవ్'ను హీరోగా పరిచయం చేద్దామని అనుకున్నాడు. అయితే 'అర్జున్ రెడ్డి' కథ ఆయనకి బాగా నచ్చడంతో, ఈ కథతో ధృవ్ ను తెరకి పరిచయం చేయడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చేశాడు. 'వర్మ' టైటిల్ తో బాలా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కోసం, ధృవ్ గెడ్డం పెంచేశాడు. ఆయన లుక్ చూసిన విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.      

More Telugu News