mudragada padmanabham: నెలాఖరులోగా తేల్చకపోతే మళ్లీ ఉద్యమం: ముద్రగడ హెచ్చరిక

  • కాపులను బీసీ జాబితాలో చేర్చాలి
  • నెలాఖరులోగా చేర్చకపోతే మళ్లీ ఉద్యమం
  • ఏప్రిల్ నుంచి ఉద్యమం

కాపులను బీసీ జాబితాలో చేర్చకపోతే మళ్లీ ఉద్యమం చేపడతామని కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెలాఖరులోగా కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏప్రిల్‌ నుంచి మళ్లీ ఉద్యమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ మలిదశ ఉద్యమం రాజకీయంగానా? లేక కులపరంగానా? అన్నది 13 జిల్లాల అధ్యక్షులతో చర్చించి నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News