Arun Jaitly: ఢిల్లీలో అరుణ్ జైట్లీతో టీడీపీ నేతల కీలక భేటీ

  • ఆర్థిక శాఖ నార్త్ బ్లాక్‌లో సమావేశం
  • ఏపీ విభజన వ్యవహారాలు, ఆర్థికపరమైన విషయాలపై చర్చ
  • సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి, టీడీపీ నేతలు సుజనా, యనమల, రామ్మోహన్ హాజరు

 కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని టీటీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. పార్లమెంటులోనూ వారు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. టీడీపీ నేతలతో చర్చిస్తున్నారు. ఆర్థిక శాఖ నార్త్ బ్లాక్‌లో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా పాల్గొంటున్నారు. టీడీపీ నేతలు సుజనా చౌదరి, యనమల రామకృష్ణుడు, రామ్మోహన్ నాయుడు ఏపీ విభజన సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సాయంపై వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News