Narendra Modi: ఏపీ అసెంబ్లీ ముందు మోదీ వ్యతిరేక హోర్డింగులు... కలకలం!

  • 'మోదీజీ ఏమిటీ వివక్ష?' అంటూ ప్లెక్సీ
  • కాట్రగడ్డ బాబు పేరిట హోర్డింగ్
  • ఎలా అనుమతించారని ప్రశ్నించిన బీజేపీ
  • ప్రభుత్వ ఉద్దేశం ఇదేనా అని నేతల విమర్శ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్ లు కనిపించడంతో ఈ ఉదయం కలకలం రేగింది. టీడీపీ నేత కాట్రగడ్డ బాబు పేరిట 'మోదీజీ ఏమిటీ వివక్ష?' అన్న హెడ్డింగ్ తో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, ప్లెక్సీలను కట్టగా, బీజేపీ నేతలు టీడీపీ తీరుపై విరుచుకుపడ్డారు. ఈ ఉదయం అసెంబ్లీలో సమావేశమైన బీజేపీ నేతలు మాణిక్యాలరావు, విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, మాధవ్ తదితరులు ఈ హోర్డింగులపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

ఈ హోర్డింగులను పెట్టేందుకు ప్రభుత్వం ఎలా అనుమతించిందని వారు ప్రశ్నించారు. ఇది టీడీపీ ఉద్దేశమా? లేక వ్యక్తిగతమా? అన్నది తేల్చి చెప్పాలని సోము వీర్రాజు నిలదీశారు. తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నప్పటికీ, టీడీపీ ఏ మాత్రమూ తమను ఖాతరు చేయడం లేదని ప్రధానినే అవమానిస్తున్నారని మాధవ్ ఆరోపించారు.

More Telugu News