ఆత్మసౌందర్యాన్ని చాటుకున్న అమలాపాల్...!
- తన కళ్లను దానం చేస్తానని ప్రకటన
- నేత్రదానంపై అవగాహనకు 'అమలా హోమ్' ఏర్పాటు
- చూడటం ప్రతి ఒక్కరి హక్కని వెల్లడి
"అగర్వాల్ ఐ కేర్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కొన్ని నిజాలు నాకు తెలిశాయి. ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల మంది అంధత్వంతో బాధపడుతున్నట్లు నాకు తెలిసింది. అందులో మూడో వంతు భారత్లో ఉన్నారు. అందులో 70 శాతం కేసులు పరిష్కరించగలిగినవే. చూసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అది సాధ్యమయ్యేందుకు అందరూ కృషి చేయాలి" అని అమలాపాల్ కోరింది.