కార్తీ చిదంబరాన్ని ముంబై విమానం ఎక్కించిన సీబీఐ!
- గత వారంలో అరెస్టయిన కార్తీ
- ముంబైకి తీసుకెళ్లి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ
- విచారిస్తున్న సీబీఐ, ఈడీ అధికారులు
ప్రస్తుతం మూతపడ్డ ఐఎన్ఎక్స్ మీడియా కార్యాలయానికి కార్తీని తీసుకెళ్లి విచారించనున్నామని, ఈడీ అధికారులు కూడా ఈ విచారణకు హాజరవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, తన కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, అందువల్లే తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చిదంబరం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరాన్ని సైతం ప్రశ్నించేందుకు సీబీఐ నోటీసులను సిద్ధం చేసిందని వార్తలు వస్తున్నాయి.