5న ధర్నా, 21న అవిశ్వాసం, ఏప్రిల్ 6న ఎంపీల రాజీనామా: తేల్చిచెప్పిన వైఎస్ జగన్
- ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్ర
- ఢిల్లీలో ధర్నా నిమిత్తం ఎంపీలకు వీడ్కోలు
- స్పీకర్ ఫార్మాట్ లోనే ఎంపీల రాజీనామాలు
ఆపై 21వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడదామని, అప్పటికీ హోదా ఇవ్వకుంటే, చివరి అస్త్రంగా వచ్చే నెల 6వ తేదీన ఎంపీల రాజీనామాలు ఉంటాయని ఆయన అన్నారు. నేతల రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్ లోనే ఉంటాయని, అదే వైకాపా చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదాపై పోరాటం క్లైమాక్స్ కు చేరిందని అభిప్రాయపడ్డ ఆయన, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.