Jagan: త‌మ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే మ‌రో అసెంబ్లీ అభ్య‌ర్థి పేరును ప్ర‌క‌టించిన జ‌గ‌న్!

  • పాద‌యాత్ర చేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్
  • ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ అభ్యర్థి పేరు ఖరారు 
  • ఆ నియోజ‌క‌వ‌ర్గ అభ్యర్థిగా మాధవ్‌ పోటీ చేస్తార‌ని ప్రకటన

పాద‌యాత్ర చేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి ఈ రోజు ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలోని శివ‌రామ‌పురంలో పర్య‌టించారు. గ‌తంలో ఆయ‌న 2019 ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవిని ఎన్నికల బరిలో దింపుతున్నట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పేరును ప్ర‌క‌టించారు. త‌మ పార్టీ నుంచి దర్శి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ అభ్యర్థిగా మాధవ్‌ పోటీ చేస్తార‌ని వెల్ల‌డించారు. ఆయ‌నను ప్ర‌జ‌లు ఆదరించాలని కోరారు.

More Telugu News