geetha singh: ఈత రాకపోయినా స్విమ్మింగ్ పూల్లో దూకేశాను: హాస్యనటి గీతాసింగ్

  • ఆ సీన్ డూప్ తో చేస్తారనుకున్నాను 
  • నాతోనే చేస్తారని తెలిసి భయపడ్డాను
  • జ్వరంతోనే ఫైట్ సీన్ చేశాను

గీతా సింగ్ కి మంచి పేరు తీసుకొచ్చిన చిత్రాల్లో 'కితకితలు' ఒకటి. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకి ఎదురైన ఒక అనుభవం గురించి ఆమె ఐ డ్రీమ్స్ తో చెప్పుకొచ్చారు. " ఈ సినిమాలో స్విమ్మింగ్ పూల్ సీన్ ఒకటి వుంది. అందులోకి నేను దూకే సీన్ ను ఆ రోజున ప్లాన్ చేశారు. డైరెక్టర్ గారు 'నీకు ఈత వచ్చా '? అని అడిగితే, 'వచ్చు' అని చెప్పాను .. ఆ సీన్ ను డూప్ తో తీస్తారనుకుని.

"కానీ ఆ సీన్ ను నా పైనే చిత్రీకరించారు. స్విమ్మింగ్ పూల్ లోని వాటర్ ఒక్కసారిగా పైకి వచ్చేలా లోపల బాంబులు పెట్టారు. సమయానికి కాపాడకపోతే మునిగిపోతానేమోనని ఒకటే భయం .. కాళ్లు చేతులు వణుకుతున్నాయి. టేక్ ఓకే అయ్యేంత వరకూ దూకి .. దూకి నాకు నరేశ్ కి ఇద్దరికీ కూడా విపరీతమైన జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంతోనే ఆ మరుసటి రోజు గుడి దగ్గర ఫైట్ సీన్ చేశాను" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News