India: భారత్‌, శ్రీలంక, బంగ్లా ట్రై సిరీస్‌ నుంచి వైదొలగిన బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌

  • ఈ నెల 6వ తేదీ నుంచి ముక్కోణపు టీ20 సిరీస్
  • ప్రకటన చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు
  • గాయం నుంచి కోలుకోలేదని వివరణ

భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య  ఈ నెల 6వ తేదీ నుంచి ముక్కోణపు టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మరో మూడు రోజుల్లో ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సిరీస్ నుంచి బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌, కీలక ఆటగాడు షకిబుల్‌ హసన్‌ గాయం కారణంగా వైదొలగడంతో ఆ జట్టుకి ఎదురుదెబ్బ తగింది.

తాజాగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన చేసి,  షకిబుల్ వేలి గాయంతో బాధపడుతున్నాడని ఈ సిరీస్ ఆడలేడని చెప్పడంతో బంగ్లా అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇటీవల ఢాకాలో జరిగిన ఓ వన్డే మ్యాచులో ఆడుతూ షకిబుల్ గాయపడ్డాడు. ట్రై సిరీస్ నాటికి కోలుకుంటాడని భావించారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన ఈ సిరీస్‌కి దూరమవుతున్నాడు.

More Telugu News