geetha singh: ఫిల్మ్ సిటీని ఫ్రీగా చూసేయవచ్చనే ఆశతో ఆడిషన్స్ కి వెళ్లాను!: హాస్యనటి గీతాసింగ్

  • జై' ఆడిషన్స్ కి వెళ్లాను 
  • తేజ గారు చేయమన్న సీన్ చేసి చూపించాను 
  • ఫస్టు సీన్ కే అంతా నవ్వేశారు  

హాస్యనటిగా గీతా సింగ్ కి మంచి పేరుంది. 'కితకితలు' సినిమాతో ఆమె మరింతగా పాప్యులర్ అయ్యింది. అలాంటి గీతా సింగ్ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "రామోజీ ఫిల్మ్ సిటీలో 'జై' మూవీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ విషయం తెలిసి నేను అక్కడికి వెళ్లాను. ఈ రకంగానైనా ఫిల్మ్ సిటీని ఫ్రీగా చూసేయవచ్చనే ఆశ".

"ఒక సీన్ ఇచ్చి చేయమంటే చేశాను గానీ .. నన్ను సెలెక్ట్ చేస్తారనే నమ్మకం నాకు లేదు. కానీ తేజ గారు నన్నే సెలెక్ట్ చేశారు .. వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెబితే ఎవరూ నమ్మలేదు. అప్పుడే కాదు .. షూటింగ్ మొదలయ్యేవరకూ వాళ్లు నమ్మలేదు. ఫస్టు డే ఫస్టు సీన్ లో వేణు చేయి కొరికే సీన్ ఇచ్చారు నాకు .. చేశాను .. తేజతో సహా అంతా నవ్వారు. కాకపోతే ఇప్పటికీ వేణు చేతికి ఆ మచ్చ ఉండే ఉంటుంది" అంటూ నవ్వేశారు. 

More Telugu News