mahesh: యాక్షన్ ఎపిసోడ్ లో మహేశ్ .. లండన్ వెళ్లడంలో ఆలస్యం

  • హైదరాబాద్ లో 'భరత్ అనే నేను' షూటింగ్
  • యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ 
  • చివరి షెడ్యూల్ లండన్ లో  

'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో జరుగుతోంది. మహేశ్ బాబు .. తదితరులు పాల్గొనగా ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీన్ ను ఈ నెల 9వ తేదీ వరకూ తీయనున్నారు.

ముందు అనుకున్న షెడ్యూలు ప్రకారం, ఆ వెంటనే ఈ సినిమా టీమ్ లండన్ వెళ్లవలసి వుందట .. అయితే కొన్ని రోజుల పాటు మహేశ్ రెస్ట్ తీసుకున్న తరువాత ఆ షెడ్యూల్ ను మొదలుపెడతారని తెలుస్తోంది. కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించనున్నారు. దాంతో ఈ సినిమా టాకీపార్టును పూర్తిచేసుకోనుంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయనున్నారు.   

More Telugu News