nikhil: నిఖిల్ కొత్త సినిమా మొదలైపోయింది

  • విడుదలకి ముస్తాబైన 'కిరాక్ పార్టీ'
  • ఈరోజే మొదలైన 'కణితన్' రీమేక్ 
  • త్వరలోనే కథానాయిక ఎంపిక

మొదటి నుంచి కూడా నిఖిల్ తన దూకుడు చూపిస్తూనే వస్తున్నాడు. కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూనే వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా ఆయన చేసిన 'కిరాక్ పార్టీ' ఈ నెల 16వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఆయన 'కణితన్' సినిమా రీమేక్ లో చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. తమిళంలో హిట్ కొట్టిన ఈ సినిమాకి సంతోష్ దర్శకుడిగా వ్యవహరించాడు.

 దాంతో ఆయన దర్శకత్వంలోనే ఈ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. నిఖిల్ సరసన ఛాన్స్ కొట్టేశారంటూ కొంతమంది కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే ఇంకా ఎవరూ ఖరారు కాలేదని అంటున్నారు. కథానాయిక ఎవరనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తారట. ఈ ప్రాజెక్టు తరువాత నిఖిల్ 'కార్తికేయ' సీక్వెల్ చేసే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

More Telugu News