Ramcharan: 'రంగస్థలం' పాట రిలీజ్: ‘వినపడేట్టు కాదురా.. కనపడేట్టు కొట్టండెహే’ అంటున్న రామ్ చరణ్!

  • ‘రంగస్థలం’లో మరో పాట విడుదల 
  • ‘రంగ..రంగ..రంగస్థలాన..’ పాటలో అదిరిన చెర్రీ
  • ఈ నెల 30న విడుదల కానున్న ‘రంగస్థలం’

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలోని ‘ఎంత సక్కగున్నావె..’ అనే పాట  ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా, ‘రంగ..రంగ.. రంగస్థలాన..’ అని సాగే పాటను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది.

ఈ సినిమాలో వినికిడి లోపం ఉన్న వ్యక్తి పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. అందుకే, ‘వినపడేట్టు కాదురా.. కనపడేట్టు కొట్టండెహే..’ అంటూ ఉత్సాహపరచడం ఆ పాటలో కనపడుతుంది. కాగా, ఈ నెల 30న విడుదల కానున్న ‘రంగస్థలం’ చిత్రంలో ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

More Telugu News