anam vivekananda reddy: ఆనం వివేకానందరెడ్డికి అస్వస్థత.. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స

  • హైదరాబాదులో చికిత్స పొందుతున్న ఆనం
  • నేడు పరామర్శించిన లోకేష్
  • ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి

నెల్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, ఆసుపత్రిలో ఉన్న వివేకాను ఈరోజు ఏపీ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు.  

More Telugu News