Ramgopal Varma: ఇంతకన్నా అత్యుత్తమ స్క్రిప్టుతో ఎవరైనా రాగలరా?: రాంగోపాల్ వర్మ సవాల్!

  • తాజా రాజకీయ పరిణామాలను ప్రస్తావించిన వర్మ
  • ఇంతకన్నా క్రూరమైన కథనం అందించగలరా?
  • తనకు అనుమానమేనని ట్వీట్

ఇండియాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను, ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో సీబీఐ విచారణ తదితరాలను ప్రస్తావిస్తూ, ట్విట్టర్ వేదికగా దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ సవాల్ విసిరారు. "చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ, కాంగ్రెస్ అవినీతి, బీజేపీ ప్రతీకారం, అక్రమంగా నగదు తరలింపు, నీరవ్ మోదీ, బ్యాంకుల్లో కుంభకోణం, ఇంద్రాణీ ముఖర్జియా మరియు ఓ హత్య... అన్నీ ఉన్నాయి. ఓహో... బాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్లలో ఎవరైనా ఇంతకన్నా క్రూరమైన కథనాన్ని అందించగలరా? నాకు అనుమానమే" అని వ్యాఖ్యానించాడు. ఈ రోజు ఉదయం గం 11. 01 లకు ఈ ట్వీట్ చేయగా, వందలాది మంది దీన్ని లైక్ చేస్తున్నారు.

More Telugu News