train: రైలులో పెళ్లి... కొత్త జంటను ఆశీర్వదించిన శ్రీశ్రీ రవిశంకర్‌!

  • ఉత్తర ప్రదేశ్‌లో ఘటన
  • రొటీన్‌కి భిన్నంగా కదులుతోన్న రైలులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న జంట 
  • అదే రైలులో ప్రయాణిస్తూ విషయం తెలుసుకున్న శ్రీశ్రీ రవి శంకర్

ఓ జంట క‌దులుతోన్న రైలులో పెళ్లి చేసుకున్న ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్వ‌ర్యంలోనే ఈ వరుడు అమ్మాయి మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. పూర్తి వివ‌రాలు చూస్తే, ఆ రాష్ట్రంలోని కౌశంబి ప్రాంతానికి చెందిన సచిన్‌ కుమార్‌కు, జ్యోత్స్న సింగ్‌ పటేల్ అనే అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. వ‌రుడు ఫార్మాసిస్ట్‌గా జాబ్ చేస్తుండ‌గా, వ‌ధువు సెంట్రల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తోంది.

రోటీన్ కి భిన్నంగా వీరిద్ద‌రు రైలులో త‌మ పెళ్లిని జరుపుకోవాలని నిర్ణ‌యం తీసుకున్నారు. రైల్వే అధికారుల‌కు విష‌యం చెప్ప‌గా వారు కూడా ఓకే అన్నారు. స‌రిగా వారు పెళ్లి జ‌రుపుకుంటోన్న రైలులోనే శ్రీశ్రీ రవిశంకర్ కూడా ప్ర‌యాణించ‌డం విశేషం. ఈ విష‌యం తెలుసుకున్న ఆయ‌న‌.. వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.    

  • Loading...

More Telugu News