nagachaitanya: మాస్ కంటెంట్ చైతూకి ఈసారైనా కలిసొచ్చేనా?

  • చందూ మొండేటితో 'సవ్యసాచి 
  • మారుతితో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • తదుపరి చిత్రం బాబీతో  

ప్రస్తుతం చైతూ .. చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఆయన బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 'జై లవ కుశ' తో హిట్ కొట్టిన బాబీ, అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి కసరత్తు చేశాడు గానీ కుదరలేదు.

 దాంతో చైతూను కలిసి ఒక కథ చెప్పాడట. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలతో సిద్ధం చేసిన ఆ కథ నచ్చడంతో చైతూ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అయితే మొదటి నుంచి కూడా లవర్ బాయ్ గా చేసిన సినిమాలు చైతూకి కలిసొచ్చాయిగానీ, మాస్ సబ్జెక్టులు కలిసి రాలేదు. మరి బాబీతో చేసే మాస్ ఎంటర్టైనర్ చైతూకి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.      

  • Loading...

More Telugu News