Sridevi: ఎరుపు రంగు కాంజీవరం చీరలో శ్రీదేవి పార్థివదేహం

  • శ్రీదేవికి కాంజీవరం చీరలంటే ఇష్టమట
  • కొనసాగుతున్న శ్రీదేవి అంతిమయాత్ర
  • అంతిమయాత్ర వాహనంలో బోనీకపూర్, అర్జున్ కపూర్, మోహిత్ మార్వా తదితరులు

ప్రముఖ సినీ నటి శ్రీదేవి అంతిమయాత్ర కొనసాగుతోంది. శ్రీదేవి పార్థివదేహానికి ఎర్రని, బొట్టు పూలతో అలంకరించారు. శ్రీదేవికి కాంజీవరం చీరలంటే ఎంతో ఇష్టమట. అందుకే, ఆమె భౌతికకాయానికి బంగారు, ఎరుపు రంగుల మిశ్రమంతో కూడిన కాంజీవరం చీరను కప్పారు.

కాగా, సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర దాదాపు ఏడు కిలోమీటర్ల మేర కొనసాగునుంది. అంతిమయాత్ర వాహనంలో బోనీకపూర్, బోనీ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్, మేనల్లుడు మోహిత్ మార్వా తదితరులు ఉన్నారు. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గౌరవ సూచకంగా ఆమె పార్థివదేహానికి త్రివర్ణ పతాకం కప్పారు.

More Telugu News