Rahul Gandhi: కర్ణాటకలో దేవాలయం ముందు సంప్రదాయ బద్ధంగా డ్రమ్స్ వాయించిన రాహుల్‌ గాంధీ!

  • అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్న కాంగ్రెస్ నేతలు
  • సిద్ధరామయ్యతో కలిసి గోడచిలోని వీరభద్ర ఆలయాన్ని సందర్శించిన రాహుల్‌
  • అనంతరం సౌందట్టి ప్రాంతంలో ఎల్లమ్మ గుడికి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓ వైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  విస్తృతంగా పర్యటిస్తూ మాటల తూటాలు పేల్చుతూ ప్రచారంలో పాల్గొంటోన్న విషయం తెలిసిందే. ఈ రోజు రాహుల్ గాంధీ.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి గోడచిలోని వీరభద్ర ఆలయాన్ని సందర్శించుకున్నారు. తరువాత బెలగావిలోని సౌందట్టి ప్రాంతంలో ఎల్లమ్మ గుడి ముందు సంప్రదాయ బద్ధంగా డ్రమ్స్ వాయించారు. ఈ క్రమంలో సిద్ధ రామయ్య ఎంతో ఉత్సాహంగా కనపడ్డారు.

More Telugu News