sridevi: ఇంకా దుబాయ్ ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే శ్రీదేవి భౌతికకాయం

  • మరో గంట సేపు పరీక్షలు కొనసాగే అవకాశం
  • సాయంత్రం 5.30 గంటల తర్వాత ఇండియాకు తరలింపు
  • దుబాయ్ లో సిద్ధంగా ఉన్న అంబానీల విమానం

అతిలోక సుందరిగా కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టిన శ్రీదేవి భౌతికకాయం కొన్ని గంటలుగా దుబాయ్ ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే ఉంది. ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన ఇంకా కొనసాగుతోంది. మరో గంటసేపు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉంది. దుబాయిలోని ముహైస్నాలో శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్ చేస్తారు. అనంతరం పోలీసులు డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా భౌతికకాయాన్ని అప్పగిస్తారు. అనంతరం అంబానీలకు చెందిన ఓ ప్రైవేట్ విమానంలో శ్రీదేవి భౌతికకాయాన్ని ఇండియాకు తరలిస్తారు. సాయంత్రం 5.30 గంటల తర్వాతే ఈ విమానం బయల్దేరే అవకాశం ఉంది.

More Telugu News