teacher: హైదరాబాద్‌ జీనియస్ గ్రామర్‌ స్కూల్‌లో.. బాలుడిని చితక్కొట్టిన టీచర్‌

  • చైతన్యపురిలో ఘటన
  • విద్యార్థి ఒంటి నిండా గాయాలే
  • కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్‌ చైతన్యపురిలోని జీనియస్‌ గ్రామర్‌ స్కూల్‌లో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు దారుణంగా చితకబాదాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విద్యార్థి ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. తన పీఈటీ టీచర్‌ సతీష్‌ తనను అకారణంగా కొట్టాడని సదరు బాలుడు సాయి కిరణ్‌ చెప్పాడు. ఆ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ బాలుడి తల్లిదండ్రులు కోరారు.

ఈ ఘటనపై ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఐపీసీ 323 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ విద్యార్థి  జీనియస్‌ గ్రామర్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడని చెప్పారు.    

More Telugu News