India: అందుకే, నిన్నటి మ్యాచ్‌లో ఓడిపోయి.. సిరీస్‌ కోల్పోయాం: దక్షిణాఫ్రికా కెప్టెన్‌

  • టీమిండియా బౌలర్లు నియంత్రణతో బౌలింగ్ చేశారు
  • లక్ష్యాన్ని ఛేదించలేకపోయాం
  • ముఖ్యంగా పవర్‌ ప్లేలో టీమిండియా బౌలర్లు విసిరిన బంతులు దెబ్బతీశాయి
  • తొలి ఆరు ఓవర్లలో సింగిల్స్‌ తీయడం అత్యంత కష్టమైంది

చివరి ఓవర్లలో తీవ్ర ఉత్కంఠ రేపిన నిన్నటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తమ జట్టు ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్‌ జేపీ డుమినీ మాట్లాడుతూ... టీమిండియా బౌలర్లు నియంత్రణతో బౌలింగ్ చేశారని అందుకే తాము లక్ష్యాన్ని ఛేదించలేకపోయామని తెలిపాడు. ముఖ్యంగా పవర్‌ ప్లేలో టీమిండియా బౌలర్లు విసిరిన బంతులు తమను దెబ్బతీశాయని అన్నాడు.

తొలి ఆరు ఓవర్లలో సింగిల్స్‌ తీయడం అత్యంత కష్టమైందని తెలిపాడు. నకుల్‌ బాల్స్ తో తమను బాగా ఇబ్బంది పెట్టారని, పవర్‌ ప్లేలో 30 పరుగులు వెనుకబడిపోయామని ఆయన అన్నాడు. తమతో జరిగిన చివరి టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. వన్డే, టీ20 సిరీస్‌లలో టీమిండియా షాకిచ్చిందని తెలిపాడు.

More Telugu News