Tamilnadu: ఆ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తే...చంపేస్తాం!: బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ కు బెదిరింపులు

  • తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ 
  • మార్చి 23న పెరంబలూరు, అరియలూరు, జయంకొండాం, ఉడైయార్‌ పాళెయంలో పర్యటన
  • హెచ్చరికలను బేఖాతరు చేసి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తే..!

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ ను హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెన్నైలోని మాంబళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం మధ్యాహ్నం దాటిన తరువాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అధ్యక్షురాలి పేరుతో ఒక లేఖ వచ్చింది. దానిని తెరిచి చదివిన ఆమె షాక్ అయ్యారు. ఆ లేఖలో 23న పెరంబలూరు, అరియలూరు, జయంకొండాం, ఉడైయార్‌ పాళెయం తదితర ప్రాంతాల్లో తమిళిసై పర్యటించనున్న విషయం తెలిసిందని, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌ పై చౌకబారు వ్యాఖ్యలు చేసినందుకు ఆ ప్రాంతాలకు ఆమె వెళ్లకూడదని, కాదని ఆ ప్రాంతాలకు వెళ్తే ప్రాణాలతో తిరిగిరారని చెబుతూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై పార్టీ నేతలతో చర్చించిన అనంతరం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 

More Telugu News