Krshna: శ్రీదేవి మా ఇంట్లో పెరిగిన పిల్ల: హీరో కృష్ణ

  • ఆమె మరణవార్త షాక్‌కు గురిచేసింది
  • నరేశ్, శ్రీదేవి చిన్ననాటి మిత్రులు
  • చెన్నైలో మా ఇంటి పక్కనే ఆమె ఇల్లు
శ్రీదేవి మరణంపై ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన చెప్పారు. శ్రీదేవి తమ ఇంట్లో పెరిగిన పిల్ల అని ఆయన అన్నారు. చెన్నైలో తమ ఇంటి పక్కనే వాళ్ల ఇల్లు ఉండేదని ఆయన చెప్పారు. ఆమె తనతోనే అత్యధికంగా 31 చిత్రాలు చేసిందన్నారు. ఆమె మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ఆయన చెప్పారు. తమ నరేశ్, శ్రీదేవి చిన్ననాటి స్నేహితులని ఆయన అన్నారు.

మరో నటుడు కృష్ణంరాజు కూడా ఆమె గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఆమె మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మహా నటీమణులు సావిత్రి, భానుమతి మినహా శ్రీదేవి మాదిరిగా నటించే వారు ఎవ్వరూ లేరని ఆయన కొనియాడారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఓ గొప్ప నటిని కోల్పోయిందని ఆయన అన్నారు. కాగా, దుబాయిలో ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.  
Krshna
Krishnam raju
Rana
Kajal
Sridevi

More Telugu News