India: రికార్డు నెలకొల్పిన భారత మహిళల క్రికెట్ జట్టు!

  • దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల జట్టు
  • ఐదు టీ20ల సిరీస్‌ 3-1 తేడాతో కైవసం
  • ఇటీవల వన్డే సిరీస్‌లోనూ భారత మహిళల జట్టు 2-1 తేడాతో విజయం
  • ఒకే ప‌ర్య‌ట‌న‌లో రెండు సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా రికార్డు

ఒకే ప‌ర్య‌ట‌న‌లో రెండు సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్-దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ సిరీస్‌లో ఈ రోజు ఐదో టీ20 జరిగింది. ఇందులో ధాటిగా ఆడిన భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 54 పరుగుల తేడాతో గెలుపొందింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 112 పరుగులకే ఆలౌట్ అయింది. ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లోనూ భారత మహిళ జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

More Telugu News