veerendra sehwag: ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా: వీరేంద్ర సెహ్వాగ్

  • బియ్యం దొంగిలిస్తే చంపేశారు
  • పేద గిరిజనుడి ప్రాణాలు తీశారు
  • అభివృద్ధి చెందిన సమాజానికి ఇదొక మచ్చ

చిన్న దొంగతనం చేశాడన్న నెపంతో, మానసిక స్థితి సరిగా లేని ఓ యువకుడిని కొట్టి చంపిన ఘటన కేరళలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దారుణంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది. దుండగులు తన సోదరుడిని చంపేశారంటూ ప్రముఖ నటుడు మమ్ముట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ దారుణంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'మధు ఒక కేజీ బియ్యాన్ని దొంగిలించాడు. ఈ మాత్రం దానికి ఉబైద్, హుస్సేన్, అబ్దుల్ కరీమ్ ల గుంపు ఆ పేద గిరిజనుడిని చంపేసింది. అభివృద్ధి చెందిన సమాజానికి ఇదొక మచ్చ. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా' అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
.

More Telugu News