rail: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబులు.. నిర్వీర్యానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం

  • కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
  • మధిర రైల్వేస్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు పదార్థాల గుర్తింపు
  • ఎస్‌-11 బోగీలోని 53వ సీటు వద్ద రెండు డబ్బాల్లో బాంబులు గుర్తించిన పోలీసులు
  • బాంబుల నిర్వీర్యానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలు

ఖమ్మం జిల్లా మీదుగా ప్రయాణిస్తోన్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు బాంబులు గుర్తించారు. దీంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. మధిర రైల్వేస్టేషన్‌లోకి వచ్చిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో సాధారణ తనిఖీలు చేస్తోన్న పోలీసులకు ఎస్‌-11 బోగీలోని 53వ సీట వద్ద రెండు డబ్బాల్లో పేలుడు పదార్థాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమయిన అధికారులు ప్రయాణికులను ఖాళీ చేయించి, బాంబుల నిర్వీర్యానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని మధిర రైల్వే స్టేషన్‌కి రప్పిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.   

More Telugu News