raghu veera reddy: 'బడ్జెట్‌లో సవరణలు చేయండి'.. మోదీకి రఘువీరారెడ్డి లేఖ

  • ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక సాయంపై నిర్ణయం తీసుకోవాలి
  • ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను యూపీఏ సర్కారు ప్రవేశపెట్టింది
  • బీజేపీ పూర్తి మద్దతిచ్చిందని గుర్తు తెచ్చుకోవాలి

కొన్ని రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక సాయంపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ రోజు లేఖ రాశారు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తగిన సవరణలు చేసి ఏపీకి నిధులు కేటాయించాలని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను అప్పట్లో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టగా, అందుకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇచ్చిందన్న విషయాన్ని తాము గుర్తు చేస్తున్నామని తెలిపారు.         

More Telugu News