akashpuri: షూటింగ్ పూర్తి చేసుకున్న 'మెహబూబా'

  • ప్రేమకథా కావ్యంగా 'మెహబూబా'
  • ఆకాశ్ పూరీ జోడీగా నేహా శెట్టి
  • డబ్బింగ్ పనులు మొదలు

పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' సినిమా చేస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ .. రాజస్థాన్ లలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎక్కువగా జరిగింది. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుంది. ఆకాశ్ పూరీ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కూడా మొదలెట్టేశాడు. యాక్షన్ .. లవ్ ను సమపాళ్లలో రంగరించి పూరీ ఈ కథకు దృశ్య రూపాన్ని ఇచ్చాడు.

1971 ఇండియా - పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆకాశ్ పూరీ జోడీగా నేహాశెట్టి నటించింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథలకి భిన్నంగా ఈ సినిమా నిలుస్తుందనేది యూనిట్ సభ్యుల మాట. ఈ సినిమాతో ఆకాశ్ పూరీ లవర్ బాయ్ గా మంచి మార్కులు కొట్టేస్తాడని అంటున్నారు. సందీప్ చౌతా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.     

More Telugu News