prabhas: 'సాహో' కోసం ఎమీ జాక్సన్ తో సంప్రదింపులు!

  • భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న 'సాహో'
  • కథానాయికగా శ్రద్ధా కపూర్ 
  • ఎమీ జాక్సన్ నూ రంగంలోకి దింపే ప్రయత్నం

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోంది. త్వరలో దుబాయ్ లో ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎమీ జాక్సన్ ను కూడా తీసుకోనున్నారనేది తాజా సమాచారం.

ఈ సినిమాకి ముందే '2.0' విడుదలవుతుంది కనుక, ఆ సినిమాతో ఎమీ జాక్సన్ వచ్చే క్రేజ్ తమ సినిమాకి ప్లస్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ కారణంగానే దర్శకుడు సుజీత్ ఆమెను కలిసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ ఛాన్స్ పట్ల ఎమీ జాక్సన్ సుముఖతను వ్యక్తం చేసినా .. ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఒకవేళ ఆమె ఓకే అంటే .. ఈ  సినిమాలో ఒక పాటలో మాత్రమే కనిపిస్తుందా? ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తుందా? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. 

  • Loading...

More Telugu News