Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • హీరోలు హెల్ప్ చేశారంటున్న నాయిక 
  • ఇంద్రగంటితో సుధీర్ బాబు 'సమ్మోహనం' 
  • 'రంగస్థలం' వేడుకలో డీఎస్పీ ఆటాపాటా 
  •  'తొలిప్రేమ' దర్శకుడితో అఖిల్ మంతనాలు  

*  తెలుగు భాషలో త్వరలోనే డబ్బింగ్ చెబుతానంటోంది మల్లూ బేబీ కీర్తి సురేశ్. "మనకు తెలియని భాషలో నటించడమంటే ఎవరికైనా ఇబ్బందే. అలాంటి ఇబ్బందినే తెలుగులో నేను ఎదుర్కున్నాను. అయితే, సెట్లో నాకు సమస్య రాకుండా ఆయా దర్శకులతో పాటు ఆయా హీరోలు కూడా హెల్ప్ చేస్తున్నారు. త్వరలోనే తెలుగు బాగా నేర్చేసుకుని నా డబ్బింగ్ నేనే చెప్పేసుకుంటాను" అని చెప్పింది ప్రస్తుతం 'మహానటి' సినిమాలో సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి.
*  సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'సమ్మోహనం' అనే టైటిల్ని ఖరారు చేశారు. నిన్నటి నుంచి ప్రారంభమైన చివరి షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇందులో అదితిరావు హైదరి కథానాయికగా నటిస్తోంది.
*  రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో నిర్మిస్తున్న 'రంగస్థలం' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలో విశాఖపట్టణంలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆనాటి వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన బృందంతో కలసి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్టు తాజా సమాచారం.
*  హీరోగా తను చేసిన రెండు సినిమాలూ అపజయం పాలవడంతో, ఈసారి ఒక హిట్ సినిమా చేసేతీరాలన్న కసితో ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని పలువురు దర్శకులతో సమావేశమవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా 'తొలిప్రేమ'తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరితో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.     

More Telugu News