BJP: రిబ్బన్ కటింగ్‌ కోసం పిలిచి.. కత్తెర తీసుకురావడం మర్చిపోయిన అధికారులు..మండిపడ్డ బీజేపీ ఎంపీ

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ కలెక్టరేట్‌లో ఘటన
  • ప్రారంభోత్సవానికి వచ్చిన బీజేపీ ఎంపీ మురళీ మనోహర్ జోషీ
  • రిబ్బన్‌ను చేతితోనే తెంచి, కోపంగా వెళ్లిపోయిన వైనం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ కలెక్టరేట్‌లో సోలార్ లైట్ పానెల్ ప్రారంభోత్సవానికి వచ్చిన బీజేపీ సీనియర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి .. రిబ్బన్ కటింగ్ చేయడానికి కత్తెరలేదని మండిపడ్డారు. సోలార్ లైట్ పానెల్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న అధికారులు రిబ్బన్ కటింగ్ కోసం కత్తెర మాత్రం మర్చిపోయారు.

దీంతో ఎంపీ జోషీ.. కత్తెర ఎందుకు తీసుకురాలేదని, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రిబ్బన్‌ను చేతితోనే తెంచారు. అనంతరం ఆ ప్రారంభోత్సవంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోతోన్న సమయంలో ఓ వ్యక్తి కత్తెరతో అక్కడకు రావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మీరూ చూడండి...

More Telugu News