swarna devalayam: దేవుడి సేవ .. చపాతీలు చేసిన కెనడా ప్రధాని

  • పంజాబ్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన ట్రూడో కుటుంబం
  • సామూహిక వంటశాలలో చపాతీలు ఒత్తిన వైనం
  • ఆలయం అద్భుతంగా ఉందన్న ట్రూడో

భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్  ట్రూడో చపాతీలు చేశారు. తన కుటుంబంతో కలిసి పంజాబ్ లోని అమృతసర్ లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దేవుని సేవలో భాగంగా చపాతీలు చేశారు. సామూహిక వంటశాలలో తన భార్యతో కలిసి కూర్చున్న ఆయన, చపాతీలు ఒత్తారు.

ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ, తన కుటుంబంతో కలిసి ఆలయాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని, ఆలయం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కాగా, పంజాబ్ పర్యటనకు వెళ్లిన ట్రూడోను సీఎం అమరీందర్ సింగ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు.

More Telugu News