nithin: త్వరలో 'ఛల్ మోహన్ రంగ' నుంచి సాంగ్ రిలీజ్

  • నితిన్ హీరోగా 'ఛల్ మోహన్ రంగ'
  • కథానాయికగా మేఘా ఆకాశ్ 
  • సాంగ్ రిలీజ్ కి సన్నాహాలు

నితిన్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'ఛల్ మోహన్ రంగ' సినిమా రూపొందుతోంది. త్రివిక్రమ్ కథను అందించిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా ఒక సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా వదిలారు. నితిన్ .. మేఘా ఆకాశ్ ఇద్దరూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, మరింత గ్లామర్ గా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ .. నితిన్ నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉండటంతో, ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి .. అంచనాలు వున్నాయి. ఇంతకుముందు నితిన్ .. మేఘా ఆకాశ్ కాంబినేషన్లో వచ్చిన  'లై' సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా హిట్ కొడుతుందేమో చూడాలి.    

More Telugu News