sudheer babu: మొత్తానికి 'సమ్మోహనం' టైటిల్ నే ఖరారు చేశారు

  • ఇంద్రగంటి మోహనకృష్ణతో సుధీర్ బాబు 
  • కథానాయికగా అదితీరావు 
  • టైటిల్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేసిన నిర్మాత

విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణకి మంచి పేరుంది. 'అష్టా చమ్మా' .. 'జెంటిల్ మేన్' .. 'అమీ తుమీ' సినిమాలు దర్శకుడిగా ఆయన ప్రత్యేకతను చాటిచెబుతాయి. అలాంటి ఇంద్రగంటి మోహనకృష్ణ .. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అదితీరావు కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి 'సమ్మోహనం' అనే టైటిల్  వినిపిస్తూ వస్తోంది.

అయితే నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కి ఈ టైటిల్ విషయంలో నిన్నటివరకు కాస్త అనుమానంగా ఉందట. అందువలన మరికొన్ని టైటిల్స్ ను పరిశీలించినట్టు సమాచారం. కథ ప్రకారం ఈ సినిమాకి 'సమ్మోహనం' టైటిలే కరెక్ట్ అని ఆయన భావించి చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దాంతో ఈ సినిమాకి ఈ టైటిల్ ఖరారైపోయింది. సుధీర్ బాబుకి గల మార్కెట్ కి మించి ఈ సినిమా కోసం ఖర్చు చేస్తుండటం విశేషం.     

More Telugu News