nithyamenon: ఒకే ఒక్క పాత్రతో రూపొందిన 'ప్రాణ' .. నిత్యామీనన్ బహుభాషా చిత్రం!

  • నిత్యామీనన్ ప్రధాన పాత్రగా 'ప్రాణ' 
  • ఒకే పాత్రతో నడిచే బహుభాషా చిత్రం
  • కొత్త టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో నిత్యామీనన్ కి ఎంతో క్రేజ్ వుంది. కొత్తదనం .. ప్రాధాన్యత కలిగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆమె తన క్రేజ్ ను నిలువుకుంటోంది. తాజాగా ఆమె 'ప్రాణ' అనే ఓ బహుభాషా చిత్రంలో నటించింది. మలయాళ.. కన్నడ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఏక కాలంలో నిర్మించారు. ఈ సినిమా మొత్తం నిత్యామీనన్ పోషించిన ఒకే ఒక్క పాత్రతో నడవనుండటం విశేషం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
 
 వి.కె. ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, ప్రముఖ సినిమాటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ .. నిత్యామీనన్ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సౌండ్ డిజైనింగ్ ఈ సినిమా ప్రత్యేకతని చెబుతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి ఈ సినిమాకి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మొదటిసారిగా ఈ సినిమా కోసం 'సరౌండ్ సింక్ సౌండ్ టెక్నాలజీ'ని ఉపయోగిస్తున్నారు. డబ్బింగ్ అనేది లేకుండగా షూటింగ్ సమయంలోనే డైలాగ్స్ రికార్డు అవుతాయని అంటున్నారు. "నాలుగు భాషల్లో రూపొందుతున్నందు వలన ఒక్కోసారి ఒక్కో భాషలో డైలాగ్ చెప్పాల్సి వచ్చింది .. కష్టమే అయినా తప్పలేదు" అని తాజా ఇంటర్వ్యూలో నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.     

More Telugu News