worship: బ్యాంకింగ్ వ్యవస్థను సరైన దారిలో పెట్టాలని.. చిలుకూరు బాలాజీ ఆలయంలో పూజలు!

  • బ్యాంకుల విషయంలో రాజకీయ, ప్రభుత్వాల జోక్యం తగ్గేలా చూడాలి 
  • భక్తులతో రుణ విమోచన నృసింహ పారాయణం చేయించాం
  • బ్యాంకులను చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు: పూజారులు

గతంలో దేశంలోని బ్యాంకులను మోసం చేసి వ్యాపారవేత్త విజయ్ మాల్యా విదేశాలకు పారిపోగా, తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఎస్‌బీఐ లాంటి బ్యాంకుల్లో మొండి బకాయిలు వసూలు కాక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో సంక్షోభాలన్నీ తొలగిపోవాలని కోరుతూ చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ ప్రసిద్ధ  ఆలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరులో ఉన్న విషయం తెలిసిందే. అక్కడి స్వామి వారిని దర్శిస్తే మంచి జరుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆ ఆలయంలో పూజలు చేయించుకుంటే వీసా సమస్యలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. దేశంలో బ్యాంకులు సమస్యల్లో చిక్కుకుంటోన్న నేపథ్యంలో..  బ్యాంకుల విషయంలో రాజకీయ, ప్రభుత్వాల జోక్యం తగ్గేలా చూడాలని పూజారులు ఈ రోజు పూజలు చేశారు.

అలాగే, విఫలమైన బ్యాంకింగ్ వ్యవస్థను సరైన దారిలో పెట్టాలని ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులతో రుణ విమోచన నృసింహ పారాయణం చేయించామని పూజారి చెప్పారు.   

More Telugu News