India: వన్డేల్లో అగ్రస్థానంలో టీమిండియా.. బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో నెం.1 కోహ్లీ, బౌలింగ్‌లో బుమ్రా

  • దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన భారత్
  • 909 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న కోహ్లీ 
  • రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకు టాప్-10లో చోటు

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు 5-1 తేడాతో గెలిచి అదరగొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో 122 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా 117 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆరు వన్డేల్లో 558 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో 909 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకు టాప్-10లో చోటు దక్కింది. బౌలింగ్ విభాగంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా 787 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో ఛాహెల్ 8వ స్థానంలో ఉన్నాడు.

More Telugu News