jamuna: 'మహానటి' సినిమా గురించి నాకు చెప్పనూ లేదు .. అడగనూ లేదు!: జమున

  • సావిత్రి గురించి నాకే బాగా తెలుసు 
  • ఇద్దరం ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవాళ్లం 
  • అలాంటిది ఆమె గురించి నన్నేమీ అడగకపోవడం ఆశ్చర్యం 

దర్శకుడు నాగ్ అశ్విన్ .. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 'మహానటి' సినిమా చేస్తున్నాడు. సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి జమున ప్రస్తావించారు.

 "సావిత్రికి .. నాకు మధ్య అత్యంత సాన్నిహిత్యం వుంది. ఇద్దరం కూడా అక్కాచెల్లెళ్లుగా వుండే వాళ్లం .. అలాగే పిలుచుకునే వాళ్లం. జెమినీ గణేశన్ తో వివాహం అప్పుడు సావిత్రిని ఎవరు ఎంతగా వారించినా వినిపించుకోలేదు. ఆమె అనారోగ్య సమయంలో అమెరికా పంపించడానికి ఎంతగానో ప్రయత్నించాను. సావిత్రి స్వభావం .. ఆనాటి సంఘటనల గురించి బాగా తెలిసిన నాకు ఈ సినిమా గురించి చెప్పకపోవడం .. సావిత్రి గురించి అడగకపోవడం ఆశ్చర్యకరం. పైగా తెలుగు భాష తెలియనివాళ్లు సావిత్రి పాత్రను పోషిస్తుండటం మరీ ఆశ్చర్యం" అంటూ ఆమె ఆక్షేపించారు. ఎంతోమంది నుంచి సావిత్రికి సంబంధించిన సమాచారం సేకరించామని నాగ్ అశ్విన్ చెబుతుండగా, జమున ఇలా స్పందించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.         

More Telugu News