chiranjeevi: చిరూ కథానాయికలలో నయనతారకే ఫస్టు ప్లేస్!

  • చిరూకి విపరీతమైన క్రేజ్ 
  • ఆయన జోడీలుగా మెప్పించినవారు కొందరే
  • వాళ్లలో ప్రత్యేక స్థానంలో విజయశాంతి

మెగాస్టార్ గా చిరంజీవి అనేక మైలురాళ్లను దాటుకుంటూ వచ్చారు. ఆయనతో జోడీకట్టిన కథానాయికలలో విజయశాంతి .. రాధ .. రాధిక .. సుహాసినిలకు మంచి మార్కులు దక్కాయి. ఈ కథానాయికలలో చిరంజీవి సినిమా కోసం అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్నది విజయశాంతి మాత్రమేనట. 'గ్యాంగ్ లీడర్' సినిమా కోసం ఆమె కోటి రూపాయలను పారితోషికంగా అందుకుందంటారు.

 ఆ తరువాత చాలాకాలానికి ఆ పారితోషికం రికార్డును కాజల్ క్రాస్ చేసింది. 'ఖైదీ నెంబర్ 150' సినిమా కోసం ఆమె 2 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్టుగా సమాచారం. ఇప్పుడు ఈ రికార్డు కూడా చెరిగిపోయిందని తెలుస్తోంది. చిరంజీవి 'సైరా' సినిమాకోసం పారితోషికంగా నయనతారకి 3 కోట్లను ఇస్తున్నారట. తెలుగు .. తమిళ భాషల్లో ఆమెకి గల క్రేజ్ అందుకు కారణమని చెబుతున్నారు. ఇలా చిరూ కథానాయికలలో పారితోషికం పరంగా నయనతారదే ఫస్టు ప్లేస్ అని అంటున్నారు. ఇప్పట్లో ఈ రెమ్యునరేషన్ రికార్డును మరో కథానాయిక దాటడం కష్టమేనని చెబుతున్నారు.      

More Telugu News