India: మరే భారత క్రికెటర్ కూ సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకున్న భువనేశ్వర్ కుమార్!

  • మూడు ఫార్మాట్లలో 5 వికెట్లు తీసిన ఘనత
  • ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్
  • 21 టెస్టు మ్యాచ్ లలో 4 సార్లు ఐదు వికెట్లు తీసిన భువీ
  • వన్డేల్లో ఒకసారి, ఇప్పుడు టీ-20ల్లో కూడా

భారత క్రికెట్ చరిత్రలో బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. మూడు క్రికెట్ ఫార్మాట్లలో ఒకే మ్యాచ్ లో 5 వికెట్లు తీసిన ఘనత సాధించిన ఏకైక భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన భువీ, మూడు ఫార్మాట్లలో ఇదే ఫీట్ సాధించిన వాడిగా నిలిచాడు.

ఇప్పటికే 21 టెస్టులాడిన భువీ, 4 సార్లు ఐదు వికెట్లను పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 86 వన్డే మ్యాచ్ లు ఆడి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఘనతను ఒకసారి దక్కించుకున్నాడు. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేయగలిగే అవకాశం ఉండే టీ-20 మ్యాచ్ లోనూ ఐదు వికెట్లను తీయడంతో ఇప్పుడు భువీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత టీమ్ మేట్స్ భువనేశ్వర్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

More Telugu News