Andhra Pradesh: కర్నూలు లాడ్జీలో అశ్లీల నృత్యాలు.. పోలీసుల అదుపులో ముగ్గురు ప్రభుత్వాధికారులు?

  • అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నగరంలోని లాడ్జీలు
  • పార్టీల పేరుతో అశ్లీల నృత్యాలు
  • పోలీసుల అదుపులో నిర్వాహకులు, డ్యాన్సర్లు

కర్నూలులోని లాడ్జీలు అశ్లీల నృత్యాలకు వేదికలుగా మారుతున్నాయి. ఇటీవల ఇటువంటి ఆరోపణలు ఎక్కువ కావడంతో అటువైపు దృష్టి సారించిన పోలీసులు, ఆదివారం పక్కా సమాచారంతో ఓ లాడ్జీపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ముగ్గురు డ్యాన్సర్లు, నలుగురు ఈవెంట్ నిర్వాహకులు, ఎరువుల కంపెనీ డీలర్లు ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వారి వివరాలు గోప్యంగా ఉన్నాయి.

నగరంలోని లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. పార్టీల పేరుతో లాడ్జీలలో యథేచ్ఛగా అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో స్పందించిన పోలీసులు లాడ్జీలపై ఓ కన్నేశారు. ఆదివారం పక్కా సమాచారంతో షీ టీమ్స్‌తో కలిసి దాడి చేసిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. డ్యాన్స్ చేసే యువతులను వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తూ తెప్పిస్తున్నట్టు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News