Theft: ఆభరణాల షాపునకు వచ్చి దర్జాగా దొంగతనం చేస్తున్న మహిళలు... సీసీ కెమెరా ఫుటేజ్!

  • నగలు కొంటామంటూ వచ్చి దోపిడీ
  • హైదరాబాద్, బొల్లారంలో ఘటన
  • అరెస్ట్ చేసిన పోలీసులు

నగలు కొంటామంటూ ఓ ఆభరణాల షాపునకు వచ్చి, యజమానిని మాటల్లో పెట్టి కిలోకు పైగా వెండిని దొంగిలించిన మహిళలు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని బొల్లారం ప్రాంతంలోగల జ్యూయలరీ స్టోర్ లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఫుటేజ్ ఈ లేడీ దొంగలను పట్టించింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఈ నెల 12న పయనీర్ బజార్ లో ఉన్న కల్యాణీ జ్యూయలర్స్ కు మధ్యాహ్నం సమయంలో మంగ, స్వాతి, ఎలిజబెత్, భాగ్యమ్మ అనే మహిళలు వచ్చారు. వెండి పట్టీలను చూపించాలని కోరారు.

ఆ సమయంలో షాపులో యజమానురాలు కూర్చుని ఉంది. ఆమె పట్టీలను తీసి చూపిస్తుంటే, ఓ యువతి ఒక్కొక్కటిగా వెండి పట్టీలను పక్కకు తప్పించింది. మొత్తం కిలో బరువున్న వెండిని దొంగిలించింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. వారు వెళ్లిపోయిన తరువాత వెండి ఆభరణాలు పోయాయని గుర్తించిన ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సీసీ కెమెరాలు పరిశీలించి, వారు ఈ ప్రాంతంవారేనని గుర్తించి అరెస్ట్ చేశారు. వెండిని రికవరీ చేశామని, నిందితులను రిమాండ్ చేశామని వెల్లడించారు.

More Telugu News